భారతి ఎయిర్‌టెల్ బ్లింకిట్‌తో భాగస్వామ్యం చేసుకుంది, ఇప్పుడు కస్టమర్లు 10 నిమిషాల్లో సిమ్ కార్డ్‌ను వారి ఇంటికే డెలివరీగా పొందవచ్చు. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా టెలికాం కంపెనీ ఇస్తున్న సేవ.

ప్రస్తుతం ఈ సేవ 16 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని నగరాలకు విస్తరించనుంది.

కస్టమర్లు ₹49 చెల్లించి సిమ్ కార్డ్‌ను ఆర్డర్ చేయవచ్చు. డెలివరీ తర్వాత, ఆధార్ ఆధారిత సెల్ఫ్-KYC ద్వారా సులభంగా సిమ్‌ను యాక్టివేట్ చేయవచ్చు. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లతో పాటు నెంబర్ పోర్టింగ్ (MNP) కూడా ఎంపికగా ఉంది.

యాక్టివేషన్ కోసం ఆన్‌లైన్ వీడియో లింక్ కూడా ఉంటుంది. సహాయం అవసరమైతే, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ ద్వారా సపోర్ట్ పొందవచ్చు. కొత్త కస్టమర్లు 9810012345 నంబర్‌కు కాల్ చేయవచ్చు. సిమ్ డెలివరీ అయిన 15 రోజుల్లోపు యాక్టివేట్ చేయాలి.

ఈ సేవ ప్రస్తుతం ఢిల్లీ, గురుగ్రాం, ఫరీదాబాద్, సోనిపట్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై, భోపాల్, ఇండోర్, బెంగళూరు, ముంబై, పుణే, లక్నో, జైపూర్, కోల్‌కతా మరియు హైదరాబాద్ నగరాల్లో అందుబాటులో ఉంది.

భారతి ఎయిర్‌టెల్ మార్కెటింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ శర్మ మరియు బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధింద్సా సంయుక్తంగా మాట్లాడుతూ, “కస్టమర్ల జీవితాలను సులభతరం చేయడం మరియు వారి సమయాన్ని ఆదా చేయడం మా ఉమ్మడి లక్ష్యం. అందుకే బ్లింకిట్‌తో కలిసి 10 నిమిషాల్లో ఇంటికే సిమ్ కార్డును డెలివరీ చేసే సేవను ప్రారంభించాము. యాక్టివేషన్ ప్రక్రియ కూడా సులభంగా ఉండేలా రూపొందించబడింది. ఈ భాగస్వామ్యం ద్వారా కస్టమర్లకు వేగవంతమైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించగలమని మాకు విశ్వాసం ఉంది.” అని చెప్పారు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *